లక్షలాదికోట్ల కుంభకోణము 'రాజా' స
మక్షమున సంభవించినా; కౌరవ
పక్షపాతులవోలె దృష్టి హీనులయిరి ప్రజా
సంక్షేమక్షయకరుల్ రాజకీయరాక్షసుల్.
ఇండియాను 'నీరాడియా'విషకన్య తన
రొండి సొగసులందాడించగ, మంత్రులు లంచ
గొండులై కామినీవిటులై, దండి 'టాటా'దులకై
గండికొట్టిరి దేశసంపదకు తిండిలేనిప్రజలన్ మరిచి.