Wednesday, June 23, 2010

ఉగ్రవాదం వినాశకరం

మే నెల ఆఖరు వారం లాహోరు, పాకిస్తాన్ లో ఆహామదీయ తెగ పై (ఖాదియాని అని కూడాఅంటారు) జరిగిన ఊచకోత (ఖత్ల్--ఆమ్) కు స్పందించి రాసినది పద్యం. మాదే నిజమైనమతము మాకు మాత్రమే సత్యము ప్రకాశించింది అని వాదించి ఇతర మతస్తులకు జీవించే హక్కులేదు అని భావించే వహాబీ ముస్లింల ఉగ్రవాదాన్ని ఎత్తి చూపించేది పద్యం. పరిశీలించండి. మతం అంటే ఏమిటి? దేవుడు, సత్యం అంటే ఏమిటి? అనే విషయాని చాలా క్లుప్తంగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది.



సత్యమన్నది వజ్రకాంతిలాగుండునట
సత్యమన్నది పథ
రహితగమ్యం; పరమ
సత్యమే వివిధముగ వివరింతురిట విదులు, నే నమ్మిన
సత్యమే నిక్కమనుట ఉగ్రనీతి
.

No comments:

Post a Comment