ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మన దేశంలోనే cell phone వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రతి నెల కొన్ని లక్షల కొత్తకనెక్షన్లు అమ్ముడుపోతున్నాయి. సెల్ ఫోన్ వాడకం వృద్ధి రేటు మన దేశంలో అనూహ్యంగా పెరుగుతోంది. మన జనాభాఅలాంటిది మరి. ఈ సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఈ సౌకర్యం కేవలం అతి ధనవంతులకే పరిమితమౌతుంది అని భావించాము. కాని ఈ యుగంలో టెక్నాలజీ మహత్యం బీద సాదలకు ధనవంతులకు అందరికి అతి తక్కువ ధరలకే లభించడమనేది చాలా గొప్ప ఉపలబ్ధి, సంసిద్ధి. పూర్వ యుగాల్లో కేవలం ఋషులకు మునులకు సిద్ధపురుషులకుమాత్రమె సాధ్యపడేదట ఇలాంటి మహిమాన్విత సంభాషణ. అలాంటి ఈ యోగం తర తమ వర్ణ వర్గ బేధాలు లేకుండా అందరికి లభించడం ఈకలియుగపు విశిష్టతగా చెప్పుకో వచ్చు. సెల్ ఫోనుకు ఇప్పుడు ఎంత ప్రాముఖ్యత ఉందో ఒక్కసారి తెలుసుకోవాలంటే అసలు అలాంటి సౌకర్యం మనకు లేదని కొంచెంసేపు ఊహించుకుంటే చాలు. ఈ సౌకర్యంపై నేను రాసిన చమత్కారిక. చదివి ఆనందించండి.
'సెల్ ఫోను'తో మునులైనను మౌనమువీడి
కిలకిలయని భాషింతురు సురకాంతలతో; ఋ
షులకైనా సాధ్యమా ఈ వింతవిద్య
కలి జ్ఞానుల ఘనతే ఇది విను రామన్న!
No comments:
Post a Comment